మాడ్రిడ్ : ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో రెండోసీడ్ సింధు 21–14, 21–12తో హుయాంగ్ యు సన్ (చైనీస్తైపీ)పై గెలిచింది. 36 నిమిషాల మ్యాచ్లో తెలుగమ్మాయికి ప్రత్యర్థి నుంచి పెద్దగా పోటీ ఎదురుకాలేదు. 3–0తో తొలి గేమ్ మొదలుపెట్టిన సింధు మధ్యలో కొట్టిన కొన్ని షాట్స్ నెట్ వద్ద డ్రాప్ అయ్యాయి.
దీంతో పుంజుకున్న సన్ 4–4, 7–7, 12–12తో స్కోరు సమం చేసింది. ఈ దశలో సింధు కొట్టిన ర్యాలీలకు వరుసగా 8 పాయింట్లు రావడంతో ఈజీగా గేమ్ను గెలిచింది. రెండో గేమ్లో సింధుదే ఆధిపత్యం కొనసాగింది. మెన్స్ డబుల్స్లో ఎంఆర్ అర్జున్–ధ్రువ్ కపిల 21–17, 21–19తో క్రిస్టోఫర్ గ్రిమ్లి–మాథ్యూ గ్రిమ్లి (స్కాట్లాండ్)పై, మిక్స్డ్లో సుమిత్ రెడ్డి–సిక్కి రెడ్డి 22–20, 21–18తో ప్రెస్లి స్మిత్–అలిసన్ లీ (అమెరికా)పై, తనీషా క్రాస్టో
అశ్విని పొనప్ప21–14, 21–8తో టిఫాని హో–-గ్రోనియా సోమర్విల్లే (ఆస్ట్రేలియా)పై గెలవగా, మెన్స్ డబుల్స్లో కృష్ణ ప్రసాద్ గార్గ్–సాయి ప్రతీక్ 16–21, 21–15, 16–21తో క్రిస్టో పొపోవ్–టొమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడారు.