సింధు.. గెలిచెన్‌‌‌‌.. జపాన్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ టైటిల్‌‌‌‌ కైవసం...

సింధు.. గెలిచెన్‌‌‌‌.. జపాన్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ టైటిల్‌‌‌‌ కైవసం...

టోక్యో: ఇండియా స్టార్‌‌‌‌ షట్లర్‌‌‌‌ పీవీ సింధు.. రెండేళ్ల టైటిల్‌‌‌‌ నిరీక్షణకు ఎట్టకేలకు తెరదించింది. ఆరంభం నుంచి నిలకడగా ఆడిన సింధు.. జపాన్‌‌‌‌ ఓపెస్‌‌‌‌ సూపర్‌‌‌‌–750 టోర్నీ టైటిల్‌‌‌‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ఫైనల్లో సింధు 21–17, 21–17తో మూడుసార్లు వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ అకానె యమగుచి (జపాన్‌‌‌‌)పై సంచలన విజయం సాధించింది. తద్వారా జపాన్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ గెలిచిన తొలి ఇండియన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌గా రికార్డులకెక్కింది. 

19 నెలల నిరీక్షణ తర్వాత సింధు సాధించిన తొలి పెద్ద టైటిల్‌‌‌‌ ఇదే కావడం విశేషం. 2019 వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ తర్వాత సింధు కెరీర్‌‌‌‌లో అతి పెద్ద విజయం కూడా ఇదే. గతంలో యమగుచితో ఆడిన మ్యాచ్‌‌‌‌ల్లో తీవ్ర ఒత్తిడికి లోనయ్యే సింధు ఈసారి మాత్రం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లింది. నెట్‌‌‌‌ వద్ద మంచి నియంత్రణ, పదునైన స్మాష్‌‌‌‌లతో కేవలం 50 నిమిషాల్లోనే మ్యాచ్‌‌‌‌ను ముగించింది.

తొలి గేమ్‌‌‌‌లో యమగుచి 11–9 లీడ్‌‌‌‌లో ఉన్నా.. బ్రేక్‌‌‌‌ తర్వాత సింధు పుంజుకుంది. 36 షాట్ల సుదీర్ఘమైన ర్యాలీని గెలిచి స్కోరును సమం చేసింది. చివర్లో మరింత దూకుడుగా ఆడి వరుస పాయింట్లతో హోరెత్తించింది. రెండో గేమ్‌‌‌‌లోనూ ఇదే స్ట్రాటజీని అమలు చేసింది. 44 షాట్ల ర్యాలీతో యమగుచిని అలసిపోయేలా చేసి 8–3 ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో యమగుచి పుంజుకోవడానికి ప్రయత్నించినా.. సింధు నెట్‌‌‌‌ ప్లే ముందు నిలవలేకపోయింది.