అరెరే! .. తొలి మ్యాచ్ లోనే పీవీ సింధు ఓటమి

అరెరే! ..   తొలి మ్యాచ్ లోనే పీవీ సింధు ఓటమి

చైనా వేదికగా జరుగుతోన్న ఏషియన్ గేమ్స్లో భారత్ కు బిగ్ షాక్ తగిలింది.  భారీ అంచనాల నడుమ టోర్నీలోకి అడుగుపెట్టిన ఇండియన్ స్టార్ షట్లర్ పీవీ సింధు తొలి మ్యాచ్ లోనే ఓటమి పాలైంది.  29 సెప్టెంబర్ 2023 శుక్రవారం  థాయ్‌లాండ్‌కు చెందిన బ్యాడ్మింటిన్ ప్లేయర్  చొచువాంగ్  తో జరిగిన మ్యాచ్ లో సింధు  తేడాతో  21-14, 15-21, 14-21 మ్యాచ్ కోల్పోయింది. మహిళల క్వార్టర్ ఫైనల్ (టీమ్ ఈవెంట్)లో భారత్ 0-1తో వెనుకబడింది.

మరోవైపు  ఏషియన్ గేమ్స్లో భారత షూటర్ల హవా నడుస్తోంది.  ఇప్పటికే  13 పతకాలు కొల్లగొట్టగా తాజాగా మరో సిల్వర్ మెడల్ గెలిచారు.  10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్ లో  ఇషా, దివ్య, పాలక్ భారత్ కు  వెండి పతకం సాధించారు.  ఈ విభాగంలో చైనా గోల్డ్ మెడల్ సాధించింది.