సీఎం జగన్ ను కలిసిన పీవీ సింధు

సీఎం జగన్ ను కలిసిన పీవీ సింధు

షట్లర్ పీవీ సింధు ఏపీ సీఎం జగన్ ను కలిశారు.  ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత మొదటి సారి అమరావతి వెళ్లిన సింధు సచివాలయంలో జగన్ ను కలిశారు.  భవిషత్తులో మరిన్ని విజయాలు సాధించి మరింత పేరు ప్రఖ్యాతలు సాధించాలని సింధును అభినందించారు జగన్. గురువారం  సింధు పేరును పద్మభూషణ్ కు రికమండ్ చేసింది క్రీడాశాఖ.