లాకప్‌డెత్‌పై కౌంటర్‌ వేయండి: హైకోర్టు నోటీసులు

లాకప్‌డెత్‌పై కౌంటర్‌ వేయండి: హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: మెదక్‌  పోలీస్‌ లాకప్‌లో  ఖదీర్‌ఖాన్‌ అనే వ్యక్తి మృతిచెందిన ఘటనపై కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది.  ఈ మేరకు రాష్ట్ర హోం కార్యదర్శి, మెదక్‌ ఎస్పీ, ఇతరులకు  నోటీసులు జారీ చేసింది. పోలీసులు మెదక్‌కు చెందిన ఖదీర్‌ ఖాన్‌ను చోరీ కేసులో  అదుపులోకి తీసుకున్నారు. 

ఖాన్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే చనిపోయాడని అతని భార్య సిద్ధేశ్వరి  ఫిర్యాదు చేశారు. ఖదీర్‌ మృతి వ్యవహారంపై స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం (సిట్‌) ఏర్పాటు చేసేలా  ఉత్తర్వులు ఇవ్వాలని,  రూ.50 లక్షల పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమె హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.  ఈ రిట్‌ను చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ డివిజన్‌ బెంచ్‌ సోమవారం విచారించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.