ఈ ఏడాది T–20 క్రికెట్ ప్రపంచకప్లో జరిగిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్లో కోహ్లీ ఆటతీరుకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కోహ్లీ ఫ్యాన్సే కాకుండా క్రికెట్ చూసే అభిమానులంతా అతన్ని మెచ్చుకున్నారు.
అయితే, కోహ్లీకి మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లు కూడా తమ అభిమానాన్ని వాళ్ల స్టైల్లో ఎక్స్ప్రెస్ చేశారు. వాళ్లలో ఒకరు ఆర్.ఎ. గద్దాని. ఇతను పాకిస్తాన్లోని బెలూచిస్తాన్కు చెందినవాడు. ఇతనికి కోహ్లీ అంటే చాలా ఇష్టం.
తన ఫేవరెట్ క్రికెటర్ మ్యాచ్ గెలిపించడానికి పడిన కష్టానికి ఫిదా అయిపోయాడు. ఏదో ఒక రూపంలో తన అభిమానాన్ని చూపించాలనుకున్నాడు. ఆ ఆలోచనతో శాండ్ ఆర్ట్తో కోహ్లీ బొమ్మ గీశాడు. దానిపైన ‘లవ్ ఫ్రమ్ ఆర్.ఎ. గద్దాని’ అని రాశాడు. ఆ పోస్ట్ చూసినవాళ్లంతా మరోసారి కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తారు. గద్దాని ఆర్ట్ వర్క్ని కూడా మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. అభిమానానికి ఎల్లలు ఉండవంటే ఇదే!