బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలి: ఆర్​ కృష్ణయ్య

బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలి: ఆర్​ కృష్ణయ్య
  • రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు 50 శాతం అసెంబ్లీ టికెట్లు కేటాయించాలని, పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశ పెట్టాలని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్  చేశారు.  

హైదరాబాద్ కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య చీఫ్​గెస్ట్​గా పాల్గొని మాట్లాడారు..  బీసీ డిమాండ్లపై మోదీని కలిసి విధాన ప్రకటన చేయాలని కోరినట్లు తెలిపారు.