RBI: రెపో రేటు 6.5 శాతం యథాతథం: ఆర్బీఐ గవర్నర్

RBI: రెపో రేటు 6.5 శాతం యథాతథం: ఆర్బీఐ గవర్నర్

బ్యాంక్ లోన్లు, హౌసింగ్ లోన్లు తీసుకునే వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్.  మానిటరీ పాలసీ ప్రకటించిన ఆర్బీఐ.. కీలక వడ్డీ రేట్లను యథాతధంగా ఉంచింది. రెపోరేటు 6.5 శాతంతో యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్  తెలిపారు.  

 రెపోరేటులో ఆర్బీఐ ఎటువంటి మార్పులు చేయలేదన్నారు శక్తికాంత దాస్. ఎస్డీఎఫ్  రేటు 6.25 శాతం కొనసాగించామని వెల్లడించారు.  ఎంఎస్ఎఫ్ బ్యాంక్ రేట్  కూడా 6.75 శాతం యథాతథంగా ఉంచామన్నారు.  ద్రవ్యోల్బణం తగ్గించేందుకే రెపోరేటు పెంచలేదని తెలిపారు.

మార్చి- ఏప్రిల్ 2023లో వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం తగ్గిందని.. 2022-23లో 6.7% నుంచి  క్షీణించిందన్నారు శక్తికాంత దాస్.  అయితే లేటెస్ట్  డేటా ప్రకారం ద్రవ్యోల్బణం ఇప్పటికీ లక్ష్యానికి పైన ఉందన్నారు. తమ అంచనా ప్రకారం 2023-24లో ద్రవ్యోల్బణం 4% కంటే ఎక్కువగానే ఉంటుందన్నారు ఆర్బీఐ గవర్నర్.