ఎవరైన జాబ్స్ ఇప్పిస్తామని అంటే నమ్మోద్దు

ఎవరైన జాబ్స్ ఇప్పిస్తామని అంటే నమ్మోద్దు

రైల్వే మరియు మెట్రో జాబ్స్ ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. కేసు వివరాలు మీడియాకు వివరించారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా ఇష్టం.. ఇదే ఆసరాగా చేసుకొని చాలా మంది మోసాలు చేస్తున్నారన్నారు. నిరుద్యోగుల నుండి కోటి 50 లక్షలకు పైగా వసూలు చేసిన ముఠాను పట్టుకున్నామన్నారు. ముగ్గురు నిందితులు అరెస్ట్ చేసాం ... మరో ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు. 

ఒక మహీంద్రా జైలో, రెండు టెంపో ట్రావెలర్ వెహికల్స్, ఫేక్ ఆధార్ కార్డ్స్, ఫేక్ అప్పోయింట్మెంట్ లెటర్స్, మెట్రో స్లాట్ లెటర్, ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్, 4 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఖమ్మంకు చెందిన కాకరపర్తి సురేంద్ర అనే ప్రధాన నిందితుడు, అతని భార్య బానోతు నాగలక్ష్మి, దాచిపల్లి సురేష్ అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేసామన్నారు. భార్య నాగలక్ష్మి, ఫ్రెండ్ సురేష్.. సురేంద్రకు సహకరించేవారన్నారు. గతంలో ఫేక్ గోల్డ్ బిస్కెట్స్ ఫ్రెండ్స్ కు అమ్ముతున్న కేసులో సురేంద్ర ప్రధాన నిందితుడని రాచకొండ సీపీ పేర్కొన్నారు. 

2013 లో ఖమ్మం నుండి హైదరాబాద్ వచ్చి ప్రైవేట్ కార్ డ్రైవర్ గా చేరాడన్నాడు. ఉప్పల్ లో  పుట్ట సురేష్ రెడ్డి గా పేరు మార్చుకొని నివసించేవాడని తెలిపారు. నకిలీ సర్టిఫికెట్స్ తో చాలా బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేసేవాడన్నాడు. 10 లక్షలు ఇస్తే, రైల్వే లో, మెట్రో లో జాబ్ ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించేవాడని చెప్పారు సీపీ. సికింద్రాబాద్ రైల్ నిలయం దగ్గర అడ్డా పెట్టి, డబ్బులు కలెక్ట్ చేశారన్నారు. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి వారిని నమ్మించేవాడని సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. వచ్చిన డబ్బుతో వాళ్ళ అమ్మ పేరు మీద ఉప్పల్ లో ఒక ప్లాట్, ట్రావెల్స్ ఏజెన్సీ, సెక్యూరిటీ ఏజెన్సీ, జడ్చర్లలో కాంటీన్ లు ఓపెన్ చేసాడన్నారు. నిందితుల పై పీడీ ఆక్ట్ నమోదు చేస్తామన్నారు. బాధితుల వివరాలు సేకరిస్తున్నామన్నారు. పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు సీపీ మహేశ్ భగవత్.