సీఎం రేవంత్ రెడ్డి చొరవతో... కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం

సీఎం రేవంత్ రెడ్డి చొరవతో... కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం

ప్రజావాణి కార్యక్రమం ద్వారా రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ భార్యకు రాచకొండ కమిషనరేట్ లో ఉద్యోగం వచ్చింది. ఈ మేరకు జనవరి 9వ తేదీ మంగళవారం కానిస్టేబుల్ భార్యకు సీపీ సుధీర్ బాబు అపాయింట్ మెంట్ ఆర్డర్ అందజేశారు.

 రాచకొండ పోలీసు కమిషనరేట్ అంబర్ పేట పోలీసు హెడ్ హెడ్ క్వార్టర్స్ లో సొంగా శేఖర్ విధులు నిర్వర్తిస్తూ 2021 సెప్టెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అతని భార్య సత్యలత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందడంతో స్థానికత కారణం చూపుతూ రెండేళ్లుగా ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి గత ప్రభుత్వం నిరాకరించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ  చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన  కానిస్టేబుల్ భార్య.. తమ కుటుంబ దీనస్థితిని విన్నవించుకుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే... మానవతా దృక్పథంతో నిబంధనలు సడలించి ఉద్యోగం ఇవ్వాలని రాష్ర్ట డీజీపీ, రాచకొండ సీపీలకు ఆదేశాలు జారీ చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం డీజీపీ.. రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వాల్సిందిగా రాచకొండ సీపీకి ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయములో జూనియర్ అసిస్టెంట్ గా నియమిస్తూ.. సీపీ ఆమెకు అపాయింట్మెంట్ ఆర్డర్ అందజేశారు.  ప్రత్యేకంగా నిబంధనలు సడలించి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగంలో సమర్దవంతంగా నీతి, నిజాయితీతో పనిచేయాలని, భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని కమిషనర్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ శేఖర్ కుటుంబ సభ్యులు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ, రాచకొండ సీపీలకు కృతజ్ఞతలు తెలిపింది.