ప్లీజ్ నా ట్రస్ట్కు ఇకపై ఎవరూ డబ్బులు పంపొద్దు : రాఘవ లారెన్స్

ప్లీజ్ నా ట్రస్ట్కు ఇకపై ఎవరూ డబ్బులు పంపొద్దు : రాఘవ లారెన్స్

సౌత్ ఇండస్ట్రీలో రాఘవ లారెన్స్(Raghava Lawrence) కొరియోగ్రాఫర్‌గా చిన్న స్థాయి నుంచి సినిమా కెరీర్ను స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోగాస్టార్ డమ్ తెచ్చుకుని..ఫేమస్ యాక్టర్స్లో ఒకరిగా నిలిచారు. లారెన్స్ ఎన్నో కష్టాల నుంచి వచ్చి..ఇప్పుడు తన ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరి కష్టాలు తీరుస్తున్నారు.

లేటెస్ట్గా రాఘవ లారెన్స్ తన ట్రస్ట్కి తెలుగు ఫ్యాన్స్ ఎవరూ విరాళాలు పంపించొద్దని చెబుతూ ట్విట్టర్లో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో లారెన్స్ మాట్లాడుతూ..‘నా ట్రస్ట్‌కి ఎవ్వరూ డబ్బులు పంపొద్దు, ఇప్పుడు నా పిల్లల్ని నేనే చూసుకుంటాను. అందుకు కారణమేంటంటే, నేను డాన్స్ మాస్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ట్రస్ట్‌ను స్టార్ట్ చేశాను. అందులో 60 మంది పిల్లల్ని పెంచడం, వికలాంగులకు డాన్స్ నేర్పించడం, ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించటం వంటి కార్యక్రమాలను నిర్వహించాను. 

ఈ పనులన్నింటినీ నేను ఒక్కడినే చేయలేకపోయాను. అందుకనే ఇతరుల నుంచి సాయం కావాలని కోరాను. అలాగే ఆ టైంలో రెండేళ్లకు ఓ సినిమా మాత్రమే చేసేవాడిని. కానీ ఇప్పుడు సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తున్నాను. బాగానే డబ్బులు వస్తున్నాయి కదా.. నాకు నేనే చేయొచ్చు కదా..ఇతరులను ఎందుకు అడిగి చేయాలని నాకే అనిపించింది. అందువల్ల, ఇతరులు సేవ కోసం ఇచ్చే డబ్బులను నేను పొగరుతో వద్దనడం లేదు. 

మీకు దగ్గరలో డబ్బుల్లేక కష్టపడే ట్రస్టులు చాలానే ఉన్నాయి. నాకు ఇచ్చే డబ్బులను అలాంటి వారికి సాయంగా ఇవ్వండి. వారికెంతో ఉపయోగపడుతుంది. వారికి చాలా మంది సాయం చేయరు. నేను ఎంత చెప్పినా కొందరైతే మళ్ళీ నాకు సాయం చేస్తామని అంటున్నారు. అది నాకు చాలా సంతోషం. ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడేవారెవరో నేనే చెబుతాను. మీచేత్తో మీరే వెళ్లి సాయం చేయండి. అది మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. థాంక్యూ సో మచ్’ అంటూ తన మనసులోని మాటను షేర్ చేసుకున్నారు.  

ఇది చూసిన మన తెలుగు ఫ్యాన్స్ చాలా ప్రౌడ్ ఫీలింగ్ అన్న..మీలా నిజాయితీగా సేవ చేయాలనుకునే వారు ఉండటం ఇండియాకే గర్వకారణం అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో చూశాక చాలా మంది దగ్గర్లో ఉన్న ట్రస్టులను విజిట్ చేసి.. నిత్యావసరాలకు సంభందించిన వస్తువులతో పాటుగా..అమౌంట్ కూడా ఇస్తున్నారని సమాచారం. 

ప్రస్తుతం రాఘవ లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం చంద్రముఖి 2. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్‌‌ రోల్‌‌లో నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న సినిమా విడుదల కానుంది. ఈ మూవీ రజినీకాంత్ చంద్రముఖి మూవీకి సీక్వెల్ గా వస్తుండటంతో..చంద్రముఖి 2 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.