దుబ్బాకలో దళితబంధు అమలు చేయకపోతే ఉద్యమమే

దుబ్బాకలో దళితబంధు అమలు చేయకపోతే ఉద్యమమే

దుబ్బాక లో కూడా దళిత బందు అమలు చేయాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. దుబ్బాకలో దళిత బందు అమలు చేయకపోతే ఉద్యమం చేస్తామన్నారు.  దుబ్బాక వెనకబడిన ప్రాంతం.. కేసిఆర్ చదివి..పెరిగిన ప్రాంతం కాబట్టి  దళిత బందు అమలు చేయాలన్నారు. హుజూరాబాద్ లో ఈటెలను ఎదుర్కోలేక దళిత బందు పథకం పెట్టారని అనుకునే ప్రమాదం ఉంది కాబట్టే.. దుబ్బాక లో కూడా అమలు చేయాలన్నారు. రాహుల్ బొజ్జ మీకు ఇంతకు ముందు గుర్తుకు రాలేదా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. స్మిత సభర్వాల్ కు ముందే రాహుల్ బొజ్జ ఉమ్మడి మెదక్ జిల్లాకు కలెక్టర్ గా ఉన్నారన్నారు. 2017 లో మూడేళ్లలోపే  యాదవులు అత్యంత ధనవంతులు అవుతారని   కేసీఆర్ చెప్పిండని.. అయ్యిండ్రా అని అన్నారు.దళిత సామాజిక వర్గానికి కేసీఆర్.. కార్పొరేషన్ పదవులతోనే సరిపెడుతున్నారని....మంత్రి పదవులెందుకివ్వరని ప్రశ్నించారు.