
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వై యస్ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.
కొత్త ముఖ్యమంత్రిగా మీరు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు.. అలాగే మీ కొత్త మంత్రి వర్గానికి కూడా నా శుభకాంక్షలు..అలాగే ఎపి ప్రజలకు కూడా నా శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని పోస్ట్ చేశారు.
ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా రాహుల్ తన శుభాకాంక్షలను తెలిపారు. ఐదవ సారి సీఎం గా అద్భుత విజయం సాధించిన నవీన్ పట్నాయక్ కు తన శుభాకాంక్షలు తెలిపారు.