వాషింగ్టన్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ట్రక్కులో ప్రయాణించారు. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వరకు స్థానికంగా ట్రక్కు నడుపుకుంటున్న తల్జీందర్ సింగ్ అనే వ్యక్తి వాహనంలో వెళ్లారు.
ట్రక్కు డ్రైవర్లు ఎలా పని చేస్తారు? ట్రక్కు ఫీచర్లు ఏమిటి? వారికి చలాన్లు పడతాయా.. ఎంత వేగంతో ప్రయాణించాలి? డ్రైవర్లు ఎంత సంపాదిస్తారు? వంటి విషయాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అక్కడ డ్రైవర్లు నెలకు రూ.8 లక్షలు సంపాదిస్తారని అతడు చెప్పడంతో ఆశ్చర్యపోయారు.
ఈ సమయంలో పంజాబీ గాయకుడు దివంగత సిద్ధూ మూసేవాల ‘295’పాటను అడిగి మరీ ప్లే చేయించుకొని విన్నారు. అనంతరం ఓ రెస్టారెంట్కి వెళ్లి అక్కడి వారిని పలకరించారు.