కర్నాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర

కర్నాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్నాటకలో కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం రాయిచూర్ జిల్లా యెరాగెరా నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభించారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఆయన వెంట నడుస్తున్నారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభం కాగా.. నిన్నటి వరకు ఆయన 1,215 కిలోమీటర్ల మేర నడిచారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రేపు రాష్ట్రంలోకి ఎంటర్ కానుంది. తెలంగాణలో జరిగే యాత్రలో సోనియా, ప్రియాంక పాల్గొననున్నట్లు సమచారం. రాష్ట్రంలో రాహుల్ యాత్రకు సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. రేపటి నుంచి నవంబర్ 7 వరకు తెలంగాణలో రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యనేతలంతా హైదరాబాద్ చేరుకోనున్నారు. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక జరగనుండగా.. దానికి 2 రోజుల ముందు గాంధీ కుటుంబం హైదరాబాద్‌కు రానుంది. వచ్చే నెల 1, 2 తేదీల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రాహుల్ పాదయాత్ర చేయనుండగా, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సైతం ఆయనతో కలిసి నడవనున్నారు.