బీజేపీలో ఓటమి భయం కనిపిస్తోంది. అందుకే కుట్రలు చేస్తోంది: రాహుల్ గాంధీ

బీజేపీలో ఓటమి భయం కనిపిస్తోంది. అందుకే కుట్రలు చేస్తోంది: రాహుల్ గాంధీ

బీజేపీలో ఓటమి భయం కనిపిస్తోంది..ఓటమి భయంతోనే కుట్రలు చేస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. మా పోరాటం అంతా వ్యవస్థలను నాశనం చేస్తున్న  బీజేపీపైనే అన్నారు రాహుల్. ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అన్నదాతపై కూడా జీఎస్టీ విధిస్తోందని విమర్శించారు. బీజేపీ ఎంపీలకు ఆపార్టీలో విలువ లేదు..అందుకే  కొంతమంది బీజేపీ ఉన్నా.. మనసంతా కాంగ్రెస్ పైనే ఉందన్నారు రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ లో చిన్న కార్యకర్త కు కూడా విలువనిస్తామన్నారు. 

కాంగ్రెస్ దేశం కోసం ఏం చేసిందని కొందరు ప్రశ్నిస్తున్నారు.  సంస్థానాలు, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేసిందన్నారు. స్వాతంత్ర్యం కోసం నెహ్రు, గాంధీ జైలు వెళ్లారని చెప్పారు. స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ త్యాగాలు చేసిందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.    

  • Beta
Beta feature