కేరళలో కొన్నసాగుతున్న రాహుల్ 'భారత్ జోడో యాత్ర'

కేరళలో కొన్నసాగుతున్న రాహుల్ 'భారత్ జోడో యాత్ర'

కేరళలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఇవాళ తిరువనంతపురంలోని నవైకులంలో రాహుల్ పాదయాత్ర ప్రారంభం అయ్యింది. అంతకుముందే శివగిరిమఠంలో స్వామిజీలను ఆయన కలిశారు. శ్రీ నారాయణ గురుకు నివాళులర్పించారు. మధ్యాహ్నం రెండు గంటలకు కొల్లాంలోని స్కూల్ స్టూడెంట్లతో ఇంటరాక్ట్ కానున్నారు రాహుల్. అనంతరం రాత్రికి కొల్లాంకు చేరుకోనుంది రాహుల్ పాదయాత్ర. కేరళలో మూడ రోజు రాహుల్​ యాత్రకు జనం నుంచి మంచి స్పందన వస్తోంది. ఆయనను చూసేందుకు, మాట్లాడేందుకు చిన్నా పెద్దా అసక్తి చూపించారు.

ఇక రాహుల్ యాత్ర ఇవాళ్టితో 8వ రోజుకు చేరుకుంది. ఆయన పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ పాదయాత్రలో రాహుల్ తో పాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. ఈ యాత్రలో భాగంగా కేరళలో 19 రోజుల పాటు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. కేరళలో 457 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. రాహుల్ యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలైంది.. కాశ్మీర్ లో ముగుస్తుంది. 150 రోజుల పాటు 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలితల ప్రాంతాల గుండా 3,570 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది.