తెలంగాణలో రైతుల శ్రమతో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు రాజకీయం చేయడం సిగ్గుచేటు అని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతక బాధ్యతను విస్మరించాయన్నారు రాహుల్ గాంధీ. రైతు వ్యతిరేక విధానాలు మానాలని అన్నారు. రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పండిన చివరి గింజ కొనేవరకూ, రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుందని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.
తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు.
— Rahul Gandhi (@RahulGandhi) March 29, 2022
రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి.