ఎన్డీఏ నేతలు మాతో టచ్ లో ఉన్నరు: రాహుల్

ఎన్డీఏ నేతలు మాతో టచ్ లో ఉన్నరు: రాహుల్

 

  • కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు
  •  ఆ కూటమి బలహీనంగా ఉంది
  • చేతులు కట్టేసిన పరిస్థితుల్లోనూ కొట్లాడి గెలిచాం
  • వివక్షలేని పరిస్థితులుంటే‘ఇండియా’దే అధికారం
  • ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ


ఢిల్లీ: ఎన్డీయే కూటమిలోని నేతలు కొంతమంది తమతో టచ్‌లో ఉన్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి  రాహుల్ గాంధీ అన్నారు.  ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... నరేంద్రమోదీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మనుగడ కోసం ఇబ్బందిపడే అవకాశముందన్నారు. కూటమి బలహీనంగా ఉందని, ఏ చిన్న సమస్య తలెత్తినా ప్రభుత్వం కూలిపోవచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే జరిగితే ఓ మిత్ర పక్షం మరో వైపు తిరగక తప్పదన్నారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. 

ప్రధాని మోదీ విద్వేషాలను రెచ్చగొట్టి ఇప్పుడు ఫలితాలు పొంది ఉండొచ్చని అన్నారు. ఈసారి ప్రజలు ఆయన ఆలోచనను తిరస్కరించారని పేర్కొన్నారు. ఎలాంటి వివక్ష లేని పరిస్థితులు ఉంటే కనుక ఇండియా కూటమి తప్పక మెజార్టీ దక్కించుకొని ఉండేదని వ్యాఖ్యానించారు. చేతులు కట్టేసిన పరిస్థితుల్లో తాము పోరాడామని రాహుల్ అన్నారు.  ఆ సమయంలోనూ ప్రజలు ఇండియా కూటమికి మంచి స్థానాలు ఇచ్చారని వ్యాఖ్యానించారు. బీజేపీ పదేండ్లుగా అయోధ్య గురించే మాట్లాడుతూ వస్తోందని, కానీ అదే అయోధ్యలో ఆ పార్టీ ఓడిపోయిందని రాహుల్ గుర్తు చేశారు.