కశ్మీర్లోని మంచుకొండల్లో రాహుల్‌ ఆటలు

కశ్మీర్లోని మంచుకొండల్లో రాహుల్‌ ఆటలు


భారత్ జోడో యాత్రను విజయవంతంగా ముగించిన రాహుల్ గాంధీ..విహారయాత్రను ఆస్వాదిస్తున్నారు. రెండు రోజుల వ్యక్తిగత పర్యటనలో భాగంగా కశ్మీర్కు వచ్చిన రాహుల్ గాంధీ చిన్నపిల్లాడిలా మారారు. గుల్ మార్గ్ లో మంచువాలుల్లో స్కీయింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. భారత్ జోడో యాత్ర తర్వాత  గుల్‌మార్గ్‌లో  విహారయాత్రను ఆస్వాదిస్తున్నానని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ స్కీయింగ్ వీడియో వైరల్ అవుతోంది. 


 
రాహుల్ గాంధీ స్కీయింగ్ అద్బుతంగా చేశారు. స్కీయింగ్ పై ఎంతో పట్టు కల్గినట్లు మంచుపై దూసుకెళ్లారు. వెనకాల నుంచి కోచ్ మాటలను పాటిస్తూ మంచు వాలుల గుండా స్కీయింగ్ చేశారు. రాహుల్ గాంధీ స్కీయింగ్ చేస్తుండగా..కోచ్ వీడియోను చిత్రీకరించాడు.
 
రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రను నిర్వహించారు. 12 రాష్ట్రాలు,రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 3,970 కి.మీ యాత్ర చేశారు. ఈ యాత్రలో  100కి పైగా కార్నర్ మీటింగ్‌లు, 13 ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు.