ధరలు పెంచుడెట్ల.. సంస్థలు అమ్ముడెట్ల: మోడీ ఆలోచలివే

ధరలు పెంచుడెట్ల.. సంస్థలు అమ్ముడెట్ల: మోడీ ఆలోచలివే

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెంచాలి.. రైతులను ఎట్ల ముంచాలనే ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచిస్తారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ ఆరోపించారు. మోడీ డైలీ షెడ్యూల్​ ఇలాగే ఉంటుందం టూ రాహుల్ బుధవారం ట్వీట్ చేశారు. యూత్​కు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్తారని ఎగతాళి చేశారు. “ప్రధాని రోజువారీ చేయాల్సిన పనులు లిస్ట్ ఇట్లుంటది. పెట్రోల్, డీజిల్ రేట్లు ఎంత పెంచాలి?  ప్రజలు ఖర్చుల గురించి చర్చించుకోకుండా ఎట్ల ఆపాలి? ఉపాధి కల్పించడంపై యూత్​కు కలలు ఎట్ల చూపించాలి? ఈరోజు ఏ ప్రభుత్వ సంస్థను అమ్మాలి? రైతులను మరింత నిస్సహాయులుగా ఎట్ల చేయాలి?.. ఈ విషయాల గురించి ప్రధాని మోడీ ఆలోచించకుండా ఉండలేరు” అని రాహుల్ ట్వీట్ చేశారు.