BJP-RSSపై రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం

BJP-RSSపై రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం

BJP-RSSపై రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తమకు రాజ్యాంగంపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. తమ పార్టీ ఎవరి గొంతును అణచివేయట్లేదన్నారు. రాహుల్ గాంధీ ఎవరితో కలిసినా, ఎవరిని ఐక్యం చేసినా తమకేం ఇబ్బంది లేదన్నారు. దేశ ప్రజల మనోభావాలను గుర్తించాలన్నారు. దేశ హితం కోసం పని చేయాలని రాహుల్ కు సూచించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ కరువైందన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ నేతృత్వం వహించినన్ని రోజులు బీజేపీకి ఎలాంటి నష్టం లేదన్నారు. రాహుల్ గాంధీ దేశ ప్రజలను, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి.