
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాహుల్ గాంధీ టూర్ ఖరారైంది. శుక్రవారం ఒక్కరోజే ఐదు నియో జకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఈ మేరకు బుధవారం రాహుల్ ఒక్క రోజు టూర్ షెడ్యూల్ను ఏఐసీసీ విడుదల చేసింది. గురువారం ఉదయం ఢిల్లీ నుంచి శంషాబాద్కు రానున్న రాహుల్.. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఉదయం 11 గంటలకు పినపాకకు వెళ్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ రోడ్షోలో పాల్గొని కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. పినపాక నుంచి హెలికాప్టర్లో నర్సంపేటకు వెళ్లి.. అక్కడ సభ నిర్వహిస్తారు. నర్సంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా వరంగల్ ఈస్ట్కు సాయంత్రం 4 గంటలకు చేరుకుని పాదయాత్రలో పాల్గొంటారు. అక్కడి నుంచి వరంగల్ వెస్ట్కు వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తారు. సాయంత్రం 6.30 గంటలకు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నిర్వహించే సభలో పాల్గొని.. తిరిగి ఢిల్లీకి వెళ్తారు.
అదే రోజు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా రాష్ట్రానికి వస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.