సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తె శివానీ రాజశేఖర్ ‘అద్భుతం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు కొట్టేసింది. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. సినిమా కథల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ సినిమాలో నటించారు. తమిళం, తెలుగు భాషల్లో ఛాన్స్ లు వస్తున్నాయి. లెటెస్ట్ గా రాహుల్ విజయ్ సరసన ఆమె నటించబోతున్నారు. వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా ఏటర్నీటీ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కుతోంది. సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
జూలై 06వ తేదీ నుంచి చిత్ర రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మణికాంత్ గెల్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన డైరెక్షన్ లో ‘తెల్లవారితే గురువారం’ సినిమా రూపొందింది. ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక ఇల్లు సెట్ వేశారు. మ్యారేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ రూపొందుతోందని సమాచారం. పెళ్ళైన జంట మధ్య ఉన్న ఇగో క్లాసెస్ తో ఈ సినిమా ఉండబోతోంది. కల్యాణి మాలిక్ ఈ మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలో ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయనుంది చిత్ర యూనిట్.
.@ActorRahulVijay #ShivaniRajashekar & @ETERNITY_ENT5 film launched, regular shoot commences soon.
— Vamsi Kaka (@vamsikaka) June 29, 2022
A Long Long EGO Story@gellimanikanth @mdmoturu @kumar_kodali @LMakkapati @itsKalyaniMalik @venkateshrsr #Akhilvalluri #satyagiduturi @arvindmule_pd @manishastylist @SreedharSri4u pic.twitter.com/6LKC86amQy