ఆల్ఫాజోలం డ్రగ్ తయారీ యూనిట్లపై దాడులు

ఆల్ఫాజోలం డ్రగ్ తయారీ యూనిట్లపై దాడులు
  • రూ. 70 లక్షల విలువ గల ముడి పదార్థాల సీజ్
  • నలుగురు నిందితుల అరెస్టు

సంగారెడ్డి టౌన్ , వెలుగు : నిషేధిత పదార్థాలైన ఆల్ఫాజోలం యూనిట్లపై పోలీసులు దాడి చేశారు. రూ.70 లక్షల విలువ గల ముడి పదార్థాలు సీజ్ చేసి, నలుగురు నిందితులను అరెస్ట్​ చేశారు. బుధవారం ఎస్పీ రూపేశ్, డీఎస్పీ రమేశ్​కలిసి వివరాలు వెల్లడించారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు పసల్వాది గ్రామ శివారులో దాడులు నిర్వహించి ఆల్ఫా జోలం తయారీ యూనిట్​ను గుర్తించామన్నారు. 2 డిస్టిలేషన్ యూనిట్లు, నిందితులు ఉపయోగించిన ఫోన్లు,  రెండు కార్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.  

కంది మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటకు చెందిన బ్రహ్మానంద గౌడ్ , పటాన్​చెరు శాంతినగర్ కు చెందిన డేవిడ్ 2018 లో అండర్ ట్రయల్ నేరస్థులుగా కంది జైల్లో పరిచయమయ్యారని, బయటికి వచ్చిన తర్వాత ఆల్ఫా జోలం తయారు యూనిట్​ను ప్రారంభించారని పేర్కొన్నారు. వ్యాపారానికి సాయం చేయడానికి పసలవారికి చెందిన వినోద్ కుమార్ ను నియమించుకున్నట్లు తెలిపారు.  నివాస ప్రాంతాల్లో రహస్య కార్యకలాపాలు జరుగుతుంటే వెంటనే జిల్లా పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.