HYD : రాయదుర్గంలో ఎకరం 237 కోట్ల రూపాయలు

HYD  : రాయదుర్గంలో ఎకరం 237 కోట్ల రూపాయలు

హైదరాబాద్ టీజీఐఐసీసీలో భూముల వేలంలో సంచలన ధర నమోదైంది. రాయదుర్గం పాన్ మక్తాలో ఎకరం రూ. 237 కోట్లు పలికింది. సర్వే నంబర్ 83/1లోని 6 ఎకరాల 29 గుంటల వేలం ప్రక్రియ కొనసాగుతోంది.  గతేడాది ఇదే ప్రాంతంలో  ఎకరా రూ.177 కోట్ల  పలికింది. అపుడు 7 ఎకరాల మొత్తం రూ. 1357ల కోట్లకు పై ఆదాయం వచ్చింది. 

తెలంగాణ ఇండస్ట్రియల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కార్పొరేషన్​ (టీజీఐఐసీ) భూములకు మస్తు డిమాండ్​ వస్తోంది. నిరుడు అక్టోబర్‌‌‌‌లో ఎకరానికి రూ.177 కోట్లు పలికిన భూముల ధరలు.. అదే స్థాయిలో దూసుకుపోతున్నాయి. తాజాగా రాయదుర్గంలోని  పాన్ మక్త భూములను టీజీఐఐసీ వేలం నిర్వహిస్తోంది. .

సర్వే నెంబర్​ 83/1లోని ప్లాట్​ 1ఏ, 1ఎఫ్​లోని 6.29 ఎకరాలు, ప్లాట్​ నెంబర్​ పీ4లోని 5.09 ఎకరాలు సహా మొత్తంగా 11.38 ఎకరాల భూముల వేలానికి నోటిఫికేషన్​ ఇచ్చింది. ఎకరాకు రూ.139 కోట్లుగా అప్‌‌సెట్​ ప్రైస్​ను నిర్ధారించారు. ఈ వేలం ద్వారా రూ.2 వేల కోట్లకుపైగా ఆదాయం వస్తుందని టీజీఐఐసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్లాట్​ నెంబర్​ 1ఏ, 1ఎఫ్​లోని భూములకు మే 28న వేలం జరుగుతుండగా, ప్లాట్​ నెంబర్​ పీ4లోని భూములకు జూన్​ 1న ఆన్​లైన్​లో వేలం నిర్వహించనున్నారు.