
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 14.
పోస్టుల సంఖ్య: 368 (సెక్షన్ కంట్రోలర్)
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత లేదా సమాన అర్హత పొంది ఉండాలి. పూర్తి వివరాల కోసం ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ చూడవచ్చు.
వయోపరిమితి: 20 నుంచి 33 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 15.
లాస్ట్ డేట్: అక్టోబర్ 14.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు, మహిళలకు రూ.250.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ), స్కిల్ టెస్ట్ (అవసరమైతే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు indianrailways.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.