ఉద్యోగులకు ఇండియన్ రైల్వే ఓ గుడ్ న్యూస్ చెప్పింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, రైల్వే బోర్డు ఛైర్మన్ అనిల్ కుమార్ లహోటి ఇటీవల హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (HRMS)లో లీవ్ మాడ్యూల్ను ప్రారంభించారు. ఈ హెచ్ఆర్ఎం యాప్ ద్వారా రైల్వే కార్మికులు ఆన్లైన్లో సెలవు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సెలవుల ఆమోదం కూడా ఈ యాప్లో ఆన్లైన్లోనే చేయబడుతుంది.
దీంతో పాటు, ప్రతి రైల్వే ఉద్యోగి పేరు, హోదా, పీఎఫ్ నంబర్ లాంటి మొదలైన వివరాలతో పాటు కుటుంబ వివరాలు కూడా ఈ HRMS మొబైల్ అప్లికేషన్లో అందుబాటులో ఉంటాయి. ఈ అప్లికేషన్లో రైల్వే సిబ్బంది సర్వీస్ రికార్డ్ కూడా ఉంటుంది. అందులో బదిలీ, ప్రమోషన్ ఆర్డర్లు, అవార్డుల వివరాలకు సంబంధించిన వివరాలు కూడా నమోదు చేయబడతాయి.