
న్యూఢిల్లీ: చిన్నారుల ప్రయాణ చార్జీల పెంపుతో ఇండియన్ రైల్వేస్ఆదాయం గణనీయంగా పెరిగింది. గత ఏడేండ్లలో రూ.2,800 కోట్ల అదనపు ఆదాయాన్ని రైల్వేశాఖ ఆర్జించింది. ఈ సమాచారం ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. సెంటర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్) తెలిపిన వివరాల ప్రకారం.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.560 కోట్ల ఆదాయం రైల్వేకు లభించడంతో మోస్ట్ ప్రాఫిటబుల్ ఇయర్గా నమోదైంది.
Also Read : కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ధర్నా
కాగా, సీఆర్ఐఎస్రైల్వే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. రిజర్వుకోచ్లో 12 ఏండ్లలోపు పిల్లలకు ప్రత్యేక సీట్లు లేదా బెర్త్లు కావాలంటే పూర్తి చార్జీలు చెల్లించాల్సిందిగా రైల్వే మంత్రిత్వశాఖ మార్చి 31, 2016న ప్రకటించింది. సవరించిన నిబంధనలు ఏప్రిల్ 21, 2016 నుంచి అమలులోకి వచ్చాయి.