ప్రముఖ చిత్రకారుడు రాజా రవి వర్మ గీసిన చిత్రం రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ‘యశోద-కృష్ణ’ తైలవర్ణ చిత్రానికి ముంబైలో గురువారం వేలం పాట నిర్వహించగా రూ.167.2 కోట్లకు పారిశ్రామికవేత్త సైరస్ పూనావాలా కొనుగోలు చేశారు. దీంతో.. ఈ చిత్రం మన దేశ కళాఖండాల వేలం చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయినదిగా రికార్డుకెకింది.
