అసదుద్దీన్ ఒవైసీకి రాజాసింగ్ సవాల్

అసదుద్దీన్ ఒవైసీకి రాజాసింగ్ సవాల్

దమ్ముంటే గోషామహల్ ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టాలని  అసదుద్దీన్ ఒవైసీకు  గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరాడు. బిఆర్ఎస్ అభ్యర్థికి లబ్ది చేకూర్చేందుకే ఎంఐఎం పార్టీ అభ్యర్థి గోషామహల్ పోటీ చేయరని రాజాసింగ్  అన్నారు. ఇదే విషయాన్ని టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించాడని.. దానికి  అసదుద్దీన్ ఒవైసీ ఇంతవరకు స్పందించలేదని రాజాసింగ్ చెప్పారు.  గోషామహల్ లో బిఆర్ఎస్ అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడానికి అసదుద్దీన్ కారణమని.. ఆయనకు రావాల్సిన బ్యాగులు వస్తే వారి పేరును ప్రగతి భవన్ కు పంపుతారని ఆయన ఆరోపించారు. 

Also Read :- బొమ్మల కొలువులు.. భలే భలే

ఈ మధ్య అసదుద్దీన్ ఒవైసీ కొత్త వ్యాపారానికి తెరతీశారని... దేశంలో ఎక్కడా ఎన్నికలు జరిగినా వారి పార్టీ నుండి అభ్యర్థిని నిలబెట్టి..  బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నాడని విమర్శించారు. ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో  పోటీ కాదు... ఎంఐఎం పార్టీ కార్యాలయం ఉన్న గోషామహల్ లో అభ్యర్థిని పెట్టాలని రాజాసింగ్ సవాల్ చేశారు.