ఆ వెహికిల్ పంపమని కేసీఆర్ చెప్పిండంట : రాజాసింగ్

ఆ వెహికిల్ పంపమని కేసీఆర్ చెప్పిండంట : రాజాసింగ్

బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ కేటాయింపు విషయంలో ప్రభుత్వ వైఖరిపై  ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. పదే పదే రిపేర్కు వస్తున్నా అదే వాహనాన్ని  బాగు చేయించి పంపుతున్నారే తప్ప కొత్త వెహికిల్ ఇవ్వడంలేదని విమర్శించారు. కొన్నాళ్ల క్రితం వాహనం మొరాయించడంతో పురానాపూల్ చౌరస్తాలో దాన్ని వదలిపెట్టి వచ్చానని, ఇప్పుడు అదే వాహనాన్ని రిపేర్ చేయించి మళ్లీ తన దగ్గరకు పంపారని రాజాసింగ్ వాపోయారు. గతంలోనూ ఇలా చాలాసార్లు జరగిందని, ఎక్కడ ఆగిపోతుందో తెలియని ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ ను మార్చాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని అన్నారు. ఖరాబైన వెహికిల్ను రిపేర్ చేసి ఎందుకు పంపుతున్నారని పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే సీఎం కేసీఆర్ తనకు అదే వాహనాన్ని కేటాయించాలని ఆదేశించిన విషయం చెప్పారని అన్నారు.