బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆలె శ్యామ్ జీకి అప్పగించాలె: రాజాసింగ్

బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆలె శ్యామ్ జీకి అప్పగించాలె: రాజాసింగ్

హైదరాబాద్/బషీర్ బాగ్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ నిరంకుశ, అవినీతి పాలనను తరిమికొట్టాలంటే బీజేపీ రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని ఆర్‌‌ఎస్‌ఎస్‌ ప్రచారక్​ ఆలె శ్యామ్​జీకి అప్పగించాల్సిన అవసరం ఉందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

దక్షిణ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ లో లక్షల మందికి శిక్షణ ఇచ్చిన శ్యామ్ జీ ని రాజకీయాల్లోకి తీసుకురావాలంటూ బీజేపీ హైకమాండ్​కు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి జోక్యం చేసుకొని హైకమాండ్ తో మాట్లాడాలని కోరారు. శ్యామ్ జీ లాంటి ప్రచారక్ రాజకీయాల్లో వస్తే రాష్ట్రంలో పెనుమార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.