గోషామహల్ నుంచే పోటీ చేస్త: రాజాసింగ్

గోషామహల్ నుంచే పోటీ చేస్త: రాజాసింగ్

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ క్యాండిడేట్ల ఫస్ట్ లిస్ట్ లో తన పేరు ఉంటుందని  ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తనపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేస్తారనే నమ్మకం ఉందని.. పార్టీ జాతీయ, రాష్ర్ట నేతలు అండగా ఉన్నారని చెప్పారు. బీజేపీ నుంచి టికెట్ రాకుంటే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని..ఇండిపెండెంట్ గా పోటీచేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

తన నియోజకవర్గంలో బీజేపీ టికెట్ ఎవరికి ఇచ్చినా  మద్దతిస్తానని వెల్లడించారు. బుధవారం గోషామహల్​లో రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. సస్పెన్షన్ ఎత్తివేయకుంటే హిందూ ధర్మం కోసం పనిచేసుకుంటానని పేర్కొన్నారు. ఇతర పార్టీల మద్దతు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని విమర్శించారు.