గండిపేట్, వెలుగు : రాష్ట్రంలో శాంతిభద్రతల్లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిలైందని, తెలంగాణ మర్డర్లకు అడ్డాగా మారిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. రాజేంద్రనగర్ పీఎస్ లో మూడు రోజుల కిందట మర్డర్ కు గురైన రాహుల్సింగ్ కేసు వివరాలు తెలుసుకునేందుకు శుక్రవారం ఆయన స్టేషన్కు వెళ్లారు.
అనంతరం రాజాసింగ్ మాట్లాడుతూ.. గత నెల 29న హైదర్గూడ జిమ్లో రాహుల్సింగ్ ను నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారని పేర్కొన్నారు. మూడు రోజులు దాటినా నిందితులను పోలీసులు అరెస్టు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ పై హోం మంత్రి మహమ్మూద్ అలీ రబ్బర్ స్టాంప్గా మారి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. మజ్లిస్ కు వ్యతిరేకంగా మాట్లాడితే మర్డర్లు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.