వారం రోజుల్లోపు రాజాసింగ్‌ను విడుదల చేయాలె: యుగ తులసి ఫౌండేషన్

వారం రోజుల్లోపు రాజాసింగ్‌ను విడుదల చేయాలె: యుగ తులసి ఫౌండేషన్

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై పీడీ యాక్ట్ పెట్టి అక్రమంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ కె. శివ కుమార్ ఆధ్వర్యంలో మహా నిరసన దీక్ష నిర్వహించారు. ఈ మహా దీక్షలో పలు హిందూ సంఘాలతో పాటు గో బంధువులు మద్దతు తెలిపి పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొన్నారు. మునావర్ ఫరూఖి హిందూ దేవుళ్లను కించపరిస్తే ఆయన షో లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న ఆయన...ధర్మం కోసం పోరాడే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ పెట్టడం దారుణమని యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివ కుమార్ అన్నారు.

వారం రోజులోపు రాజాసింగ్ ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. హైందవ ఐక్యత చాటిచెప్పే విధంగా శాంతి యుతంగా ఈ దీక్ష చేస్తున్నట్లు తెలిపారు.