డియర్ ప్రసాద్ ఐమాక్స్.. మీరు నా క్లాస్ రూమ్.. డైరెక్టర్ రాజమౌళి

డియర్ ప్రసాద్ ఐమాక్స్.. మీరు నా క్లాస్ రూమ్.. డైరెక్టర్ రాజమౌళి

ప్రతి ప్రేక్షకుడికి సినిమాలు చూడటానికి..థియేటర్స్ ఎంతో ఫీల్ ఇస్తాయి.హైదరాబాద్ లో ఫస్ట్ మల్టీప్లెక్స్ థియేటర్ అయినా ప్రసాద్ ఐమాక్స్ నిర్మించి 20 ఏళ్లు గడిచిన నేపథ్యంలో డైరెక్టర్ రాజమౌళి( Rajamouli) ఎమోషనల్ ట్వీట్ చేశారు.

'ఎన్ని శుక్రవారాలు..ఫస్ట్ డే ఫస్ట్ షోలు.. ఉదయాన్నే 8.45 గంటలకు సీట్లలోకు పరిగెత్తుకెళ్ళడం.. అప్పుడే 20 ఏళ్లు పూర్తయంటే నమ్మలేకపోతున్నా? ఇక్కడ రిలీజ్ అయ్యే ప్రతి మూవీతో ఎంతో ఆనందించా.. కొన్ని సార్లు నిరాశ చెందినా..ఏదో ఒక లెసన్ నేర్చుకుంటూనే ఉన్న.. డియర్ ప్రసాద్ ఐమాక్స్.. మీరు నా క్లాస్ రూమ్.. థాంక్యూ' అంటూ ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు. 
 

సినిమాల నుంచి ఎంతో నేర్చుకుని..నేడు ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదిగిన రాజమౌళి ప్రస్థానం ఎందరికో ఆదర్శం. అటువంటి రాజమౌళి కెరీర్ లో  ఫీల్ అయినా ప్రసాద్ ఐమాక్స్ గురుంచి ట్వీట్ చేయడంతో వరల్డ్ వైడ్ గా సెర్చ్ చేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. RRR మూవీతో ఆస్కార్ సాధించిన రాజమౌళి..ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఆఫ్రికా అడవి నేపథ్యంలో అడ్వెంచర్ ఫిల్మ్ తీయబోతున్నారు. 

 

How many Fridays...
First day first shows.
Rushing to be seated by 8.45..
Is it 20 years already??

Every movie, whether entertaining or disappointing, was teaching me a lesson..
Dear Prasads, you are not just a cinema, you are my classroom..
Thank you..???

A special mention… pic.twitter.com/0R5p76UF49

— rajamouli ss (@ssrajamouli) July 27, 2023