
రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ సూచన మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ గురుకులాలు, వసతి గృహాలను అధికారులు తనిఖీ చేశారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోనీ మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడివోలు, తహశీల్దార్ లు, హాస్టళ్లకు నియమించిన ప్రత్యేక అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. మండల ప్రత్యేక అధికారులు సంబంధిత మండలంలోని గురుకులాలు, తహశీల్దార్లు సంబంధిత మండలంలోని KGBV లు, మోడల్ స్కూల్ లను తనిఖీ చేశారు. రేపు (మంగళవారం) కూడ ఈ తనిఖీలు చేపట్టనున్నారు.
హాస్టల్ వంట గది, స్టోర్ రూములను, టాయిలెట్లను తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రతను పరిశీలించారు. వార్డెన్ ప్రతి రోజూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం వడ్డిస్తున్నారా లేదా అని పరిశీలించారు. వంట చేసే సమయంలో ఉపయోగిస్తున్న నీటిని పరిశీలించారు. అలాగే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు గురుకులాలు, వసతి గృహాల నిర్వాహకులను ఆదేశించారు. రేపు ( మంగళవారం) సాయంత్రం తనిఖీ రిపోర్ట్ ను జిల్లా కలెక్టర్ కు అందజేయనున్నారు.
గౌరవ మంత్రి శ్రీ @KTRTRS గారి ఆదేశాల మేరకు జిల్లాలోని ఎస్సీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేస్తున్న సంబంధిత అధికారులు. @CS_Telangana @KTRTRS @TelanganaCMO @IPRTelangana pic.twitter.com/rqVeR6uE3U
— CollRajannaSircilla (@Collector_RSL) August 1, 2022