రైతులకు మద్దతుగా ట్రాక్టర్ పై అసెంబ్లీకి వచ్చిన మహిళా ఎమ్మెల్యే

రైతులకు మద్దతుగా ట్రాక్టర్ పై అసెంబ్లీకి వచ్చిన మహిళా ఎమ్మెల్యే

కేంద్రం తీసుకొచ్చిన నూతన అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాదు… రైతు ఉద్యమం అంతర్జాతీయంగానూ పాకింది. విదేశాల నుంచీ ఉద్యమానికి మద్దుతు లభిస్తోంది. లేటెస్టుగా రాజస్తాన్‌ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇందిరా మీనా రైతుల ఉద్యమానికి మద్దతు పలికారు. ఇందులో భాగంగా వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రస్తుతం అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రైతులకు సంఘీభావంగా ఆమె స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. తమ హక్కుల కోసం రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపేందుకే… తాను ట్రాక్టర్‌పై అసెంబ్లీకి వచ్చినట్లు తెలిపారు. రెండు నెలలకు పైగా వారు ఎన్నో కష్టాలు పడుతూ, ఆందోళనలు, నిరసనలు తెలియచేస్తున్నారని చెప్పారు ఇందిరా మీనా.