
రాజస్థాన్లోని ఝుంఝును జిల్లాలో ఓ ఘోరం వెలుగు చూసింది. కేవలం రెండు రోజుల్లో 25కు పైగా కుక్కలను కాల్చి చంపిన దారుణ ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
దుమ్రా గ్రామానికి చెందిన షియోచంద్ బవేరియా అనే వ్యక్తి వీధుల్లో తిరుగుతూ కనిపించిన కుక్కలను కాల్చి చంపుతున్నట్లు ఓ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో కుక్కలు రక్తం మరకలతో గ్రామ వీధుల్లో, పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ పడి ఉండటం కనిపిస్తుంటుంది. భయంతో ప్రాణాల కోసం పారిపోతున్న కుక్కలను కూడా అతను వదల్లేదని కొందరు గ్రామస్తులు చెబుతున్నారు.
ALSO READ : ఎంత పనిచేసావ్ బాస్
ఈ వీడియోలో బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు రైఫిల్ గన్ తో కుక్కలను చంపడం, మూడో వ్యక్తి ఇదంతా రికార్డ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆగస్టు 4న పోలీసులు నిందితుడు బవేరియాపై భారత శిక్షాస్మృతి, ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జంతు ప్రేమికులు, గ్రామస్తులు ఈ దారుణమైన చర్యను తీవ్రంగా ఖండిస్తూ, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. .
ప్రస్తుతం బవేరియా పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అతనికి ఇంకెవరైనా సహాయం చేసారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై జంతు సంక్షేమ సంఘాలు, ఇతర ప్రముఖులు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
बहुत ही दर्दनाक-झुंझुनूं के नवलगढ़ के कुमावास गांव में एक शिकारी बावरी ने 25 से ज्यादा कुत्तों को गोलियों से भूनकर मार डाला... बदमाश खुले आम बंदूक से गांव में कुत्तों को मारते हुए वीडियो में दिख रहा है... कुछ गांव वालों की शह के बिना यह जघन्य अपराध संभव नहीं है...@pfaindia pic.twitter.com/cuhzxG65U4
— Dinesh Dangi (@dineshdangi84) August 6, 2025