రాజీవ్ గాంధీ వర్ధంతి: ప్రముఖుల నివాళి

రాజీవ్ గాంధీ వర్ధంతి: ప్రముఖుల నివాళి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వీర్ భూమిలో కాంగ్రెస్ ప్రముఖులు నివాళులు అర్పించారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ సహా… మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సహా పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను, త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు.

21వ శతాబ్దంలో భారత్ అగ్రదేశాల స్థాయికి వెళ్లాలని రాజీవ్ గాంధీ కలలుగన్నారని చెప్పారు అశోక్ గెహ్లాట్. టెక్నాలజీ గురించి మాట్లాడి, సాంకేతిక స్థాయి పెరగాలన్న లక్ష్యంతో రాజీవ్ గాంధీ పని చేశారన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, ప్రాణాలతో లేని వ్యక్తి గురించి ఇప్పటి ప్రధాని ఆరోపణలు చేయడం ప్రధానమంత్రి స్థాయి కాదన్నారు గెహ్లాట్.