తెలంగాణా ఫార్మసీ కౌన్సిల్​ మెంబర్​గా రాజు ఎన్నిక

తెలంగాణా ఫార్మసీ కౌన్సిల్​ మెంబర్​గా రాజు ఎన్నిక

మెదక్ (చేగుంట), వెలుగు: తెలంగాణా ఫార్మసీ కౌన్సిల్​ మెంబర్​ గా మెదక్​ జిల్లా చేగుంట పట్టణానికి చెందిన తొడుపునూరి రాజు ఎన్నికయ్యారు. ఇటీవల హైదరాబాద్​లో ఫార్మసీ కౌన్సిల్​ ఎన్నికలు జరగ్గా ఆయుష్​ డైరెక్టర్​ హరి చందన రిటర్నింగ్ ఆఫీసర్​ గా వ్యవహరించారు.

రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన 56 వేల మంది ఫార్మసిస్టులు, 42 వేల మంది కెమిస్టులు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువారం ఓట్ల లెక్కింపు జరిగింది. ఎన్నికల్లో మెదక్​ జిల్లా నుంచి పోటీ చేసిన రాజు 4,763 ఓట్ల మెజారిటీతో ఫార్మసీ కౌన్సిల్​ మెంబర్​ గా విజయం సాధించారు. ఆయనను జిల్లా మెడికల్​ అసోసియేషన్​ బాధ్యులు అభినందించారు.