రాజ్యసభలో గందరగోళం.. 8 మంది ఎంపీలు సస్పెండ్

రాజ్యసభలో గందరగోళం.. 8 మంది ఎంపీలు సస్పెండ్

రాజ్యసభలో 8మంది సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు.  కొత్త వ్యవసాయ బిల్లుపై   ఆదివారం రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ పట్ల దురుసుగా ప్రవర్తించిన 8 మంది సభ్యులను వారం రోజుల పాటు సభ నుంచి సస్సెండ్ చేశారు.

సస్పెండ్ అయిన వారిలో డెరిక్ ఒ బ్రెయిన్, సంజయ్ సింగ్, రాజీవ్ సతవ్, కేకే రాగేశ్,  నాసిర్ హుస్సేన్, రిపున్ బోరా, డోలా హుస్సేన్,  కరీం ఉన్నారు. సభ్యుల రద్దుతో రాజ్యసభలో గందరగోళం ఏర్పడింది. సస్పెండ్ అయిన సభ్యులతో పాటు విపక్షాలు నినాదాలు చేశారు. దీంతో సభను కాసేపు వాయిదా వేశారు వెంకయ్యనాయుడు.

రాష్ట్రంలో మరో 1302 కేసులు..9 మంది మృతి

కుప్పకూలిన మూడంతస్తుల బిల్డింగ్..8 మంది మృతి

Eight members of the House are suspended for a week: Rajya Sabha Chairman M Venkaiah Naidu