విలీన ప్రతిపాదన అంతా బూటకం .. ఫ్యామిలీలో పంపకాల తేడాను బీజేపీపై రుద్దొద్దు: లక్ష్మణ్​

విలీన ప్రతిపాదన అంతా బూటకం .. ఫ్యామిలీలో పంపకాల తేడాను బీజేపీపై రుద్దొద్దు: లక్ష్మణ్​

నిజామాబాద్, వెలుగు: కుటుంబంలో పంపకాల తేడాను ఎమ్మెల్సీ కవిత బీజేపీపై రుద్దుతున్నారని ఓబీసీ మోర్చా నేషనల్​ప్రెసిడెంట్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్​ఆరోపించారు. ‘‘బీఆర్ఎస్, బీజేపీ విలీనం ప్రతిపాదన స్టేట్​పార్టీలో ఎక్కడా చర్చకు రాలేదు. నేను బీజేపీ పార్లమెంట్​బోర్డు మెంబర్​ను. ఢిల్లీలో కూడా అలాంటి ప్రస్తావన లేదు. విలీన ప్రతిపాదన ఎక్కడ.. ఎవరి నుంచి వచ్చిందో  కేసీఆర్​ను కవిత అడిగి తెలుసుకోవాలి’’ అని లక్ష్మణ్​అన్నారు. నిజామాబాద్​లో టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చూపిన 115 మంది మున్నూరు కాపు స్టూడెంట్లకు ఆదివారం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో లక్ష్మణ్​ చేతుల మీదుగా పురస్కారాలు అందించారు.

 అనంతరం మీడియాతో లక్ష్మణ్​ మాట్లాడారు. బీసీ బిల్లు గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్​కు లేదని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్​ కపట ప్రేమ చూపుతున్నాయన్నారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్​ సామాజిక న్యాయానికి పూర్తిగా కట్టుబడి ఉందని,  ఓబీసీ కమిషన్​కు చట్టబద్ధ హోదా ఇచ్చిందని అన్నారు. ఏడాదికో రాష్ట్రంలో ఎలక్షన్​ నిర్వహిస్తే  పాలనావ్యవస్థ దెబ్బతింటుందని, సమైక్యత, సమర్థపాలనను తేవడంతో పాటు ప్రజాధనాన్ని ఆదా చేయడానికి ఒకే దేశం, ఒకే ఎన్నిక అవసరమన్నారు.

 పేదల సంక్షేమానికి మోదీ సర్కార్​ అంకితభావంతో పనిచేస్తున్నదన్నారు. కార్యక్రమంలో నేషనల్​ టర్మరిక్​ బోర్డు చైర్మన్​ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​దినేశ్​కులాచారి, స్రవంతి రెడ్డి, తోట రాజశేఖర్, శ్రీనివాస్​పటేల్, ధర్మపురి సురేందర్, నరాల రత్నాకర్, అబ్బాపూర్​ రవి, ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, రెంజర్ల నరేశ్​తదితరులు పాల్గొన్నారు.