
నిజామాబాద్, వెలుగు: కుటుంబంలో పంపకాల తేడాను ఎమ్మెల్సీ కవిత బీజేపీపై రుద్దుతున్నారని ఓబీసీ మోర్చా నేషనల్ప్రెసిడెంట్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ఆరోపించారు. ‘‘బీఆర్ఎస్, బీజేపీ విలీనం ప్రతిపాదన స్టేట్పార్టీలో ఎక్కడా చర్చకు రాలేదు. నేను బీజేపీ పార్లమెంట్బోర్డు మెంబర్ను. ఢిల్లీలో కూడా అలాంటి ప్రస్తావన లేదు. విలీన ప్రతిపాదన ఎక్కడ.. ఎవరి నుంచి వచ్చిందో కేసీఆర్ను కవిత అడిగి తెలుసుకోవాలి’’ అని లక్ష్మణ్అన్నారు. నిజామాబాద్లో టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చూపిన 115 మంది మున్నూరు కాపు స్టూడెంట్లకు ఆదివారం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో లక్ష్మణ్ చేతుల మీదుగా పురస్కారాలు అందించారు.
అనంతరం మీడియాతో లక్ష్మణ్ మాట్లాడారు. బీసీ బిల్లు గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కపట ప్రేమ చూపుతున్నాయన్నారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ సామాజిక న్యాయానికి పూర్తిగా కట్టుబడి ఉందని, ఓబీసీ కమిషన్కు చట్టబద్ధ హోదా ఇచ్చిందని అన్నారు. ఏడాదికో రాష్ట్రంలో ఎలక్షన్ నిర్వహిస్తే పాలనావ్యవస్థ దెబ్బతింటుందని, సమైక్యత, సమర్థపాలనను తేవడంతో పాటు ప్రజాధనాన్ని ఆదా చేయడానికి ఒకే దేశం, ఒకే ఎన్నిక అవసరమన్నారు.
పేదల సంక్షేమానికి మోదీ సర్కార్ అంకితభావంతో పనిచేస్తున్నదన్నారు. కార్యక్రమంలో నేషనల్ టర్మరిక్ బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్దినేశ్కులాచారి, స్రవంతి రెడ్డి, తోట రాజశేఖర్, శ్రీనివాస్పటేల్, ధర్మపురి సురేందర్, నరాల రత్నాకర్, అబ్బాపూర్ రవి, ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, రెంజర్ల నరేశ్తదితరులు పాల్గొన్నారు.