డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్తో పాటు పలువురికి అధికారులు సమన్లు జారీ చేశారు. ఇవాళ(శుక్రవారం) పలువురు సెలబ్రిటీలు ఎన్సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ముంబైలోని NCB కార్యాలయానికి రకుల్ ప్రీత్ సింగ్ చేరుకుంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ప్రియురాలు రియాతో డ్రగ్స్ చాటింగ్ గురించి అధికారులు రకుల్ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్ దీపికా పదుకొనే కూడా అధికారుల ముందు విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. తన భర్త రణవీర్ సింగ్తో కలిసి నిన్న రాత్రి ఆమె గోవా నుంచి ముంబైకి వచ్చింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి ఘటన తర్వాత విచారణ జరుపుతోన్న అధికారులకు సినీ పరిశ్రమలో డ్రగ్స్ గురించి తెలిసింది. రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొణేతో పాటు సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్ లకు కూడా అధికారులు సమన్లు జారీ చేశారు.