జాతీయ అవార్డ్స్పై ఆలస్యంగా స్పందించిన రామ్ చరణ్.. ఇంతకీ ఏమన్నాడంటే?

జాతీయ అవార్డ్స్పై ఆలస్యంగా స్పందించిన రామ్ చరణ్.. ఇంతకీ ఏమన్నాడంటే?

ఆగస్టు 25న 69 జాతీయ అవార్డ్స్ ప్రకటన జరిగిన విషయం తెలిసిందే. ఈసారి అవార్డ్స్ లో తెలుగు సినిమాలు దుమ్ములేపాయి. అందులో ఆర్ఆర్ఆర్, పుష్ప, ఉప్పెన, కొండపోలం వంటి సినిమాలున్నాయ. అంతేకాదు 70 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో మొదటిసారి బెస్ట్ ఆక్టర్ గా జాతి అవార్డు అందుకొని రికార్డ్ క్రియేట్ చేశారు అల్లు అర్జున్. దీంతో ఆయనకు ప్రపంచావ్యాప్తంగా ఉన్న ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

అయితే గ్లోబల స్టార్ రామ్ చర్మం మాత్రం ఈ అవార్డ్స్ పై కాస్త ఆలస్యంగా స్పందించారు. టీజగా ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. పుష్ప టీమ్‌కు డబుల్‌ కంగ్రాట్స్.. నా సోదరుడు అల్లు అర్జున్‌, దేవిశ్రీప్రసాద్‌కు నా శుభాకాంక్షలు అంటూ నోట్‌ రిలీజ్‌ చేశాడు. ఆ నోట్ లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకుగానూ అవార్డులు అందుకున్న ఆరుగురిని, ఉప్పెన యూనిట్‌ను, ఆలియా భట్‌ను ప్రత్యేకంగా అభినందించిన చరణ్.. భారతీయ సినిమా మరింత గర్వపడేలా చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం రామ్ చరణ్ రాసిన ఈ నోట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.