
ఎయిర్ ఇండియా విమానం క్రాష్ ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. 297 మరణించిన ఈ ఘటన దేశ చరిత్రలోనే అతిపెద్ద ఘటన. ఇందులోని 230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటీష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్, ఒక కెనడియన్ ఉన్నారు. ఈ క్రమంలో విమాన ప్రమాద తీవ్రత గురించి ఇండియాలో మాత్రమే కాదు.. ప్రపంచదేశాల్లో కూడా చర్చించుకుంటున్నారు.
ఈ సమయంలో టాలీవుడ్ విలక్షణ దర్శకుడు, వివాదాల ట్వీట్లకు కేరాఫ్ అడ్రస్ ఐనా, రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ మేరకు తన X అకౌంట్లో తనదైన శైలిలో విమాన ప్రమాద ఘటనకు సంబంధించి ఓ ట్వీట్ చేసి మళ్ళీ వార్తల్లో నిలిచాడు.
"దేవుడు ఏం చేస్తున్నాడో దేవునికి తెలుసు?..
మీరు సెలవుల కోసం అందమైన ప్రదేశానికి వెళ్తుంటే.. ఉగ్రవాదులు మిమ్మల్ని కాల్చి చంపేస్తారు.
మీరు ట్రోఫీ పరేడ్లో వేడుకలు జరుపుకోవడానికి వెళ్తే.. తొక్కిసలాటలో చనిపోతారు.
మీరు విమానంలో ఎగిరే సమయంలో.. విమానం కుప్పకూలిపోయి చనిపోతారు.
మీరు మీ హాస్టల్లో భోజనం చేస్తుంటే.. ఒక విమానం వచ్చి మీపై పడి చనిపోతారు"
GOD knows what GOD is doing ?
— Ram Gopal Varma (@RGVzoomin) June 13, 2025
You to a beautiful location for a vacation and terrorists shoot you 😒
You go to celebrate in a trophy parade and you die in a stampede 😳
You fly in a plane and the plane crashes 😢
You are eating a meal in your hostel and a plane falls on you…
అయితే, ఈ విమాన ప్రమాదంపై ఇప్పటివరకు స్పందించిన వారిలోకెల్లా విభిన్నంగా ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఇపుడీ ఈ ట్వీట్కు పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అందులో ఎక్కువమంది.. ఆర్జీవీ పోస్ట్ అందరినీ ఆలోచింపజేస్తుందని నెటిజన్లు అంటున్నారు. యాక్ట్ ఆఫ్ గాడ్ (ActOfGod) గురించి, ఈ భూమి మీద మనిషి జీవితం గురించి రామ్ గోపాల్ వర్మ బాగా చెప్పుకొచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా తనదైన శైలిలో లోతైన అర్ధాన్ని చెప్పే ఏకైక పర్సన్ ఆర్జీవీ అంటూ మరొకొందరు క్యాప్షన్స్ ఇస్తున్నారు.
ఒక మనిషి లైఫ్.. ఎప్పుడెలా ముగుస్తుందో.. ఎప్పుడెలా మారుతుందో ఎవ్వరం చెప్పలేం. అందుకే వీలైనంత ఆనందంగా.. చావుకి భయపడకుండా గడిపేయాలని వర్మ చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే, 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయలుదేరిన ఎయిరిండియా విమానంలో.. ఒక్కరూ తప్ప మిగతా ప్రయాణికులు మొత్తం చనిపోయారు. వారికితోడు.. విమాన ప్రయాణంతో ఏ సంబంధం లేని మెడికల్ స్టూడెంట్స్, స్థానికులు చనిపోవడం ఇక్కడ మరింత అత్యంత బాధాకర విషయం.
ఇదే జూన్ నెలలో బెంగళూరు చిన స్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ సంబరాలు.. విషాదంగా మారిన విషయం తెలిసిందే. RCB టీమ్ విజయాన్ని చూసి ఆనందిద్దాం అని వచ్చిన వాళ్ళు.. అర్దాంతరంగా తమ ప్రాణాలు కోల్పోయారు. స్టేడియం బయట తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయి, 50 మందికి పైగా గాయపాలయ్యారు. మే నెలలో పాకిస్థాన్ ఉగ్రవాదులు.. 26 మంది భారత అమాయక టూరిస్టులను కాల్చి చంపారు. ఇలా ఏ క్షణంలో చావు ఎటునుంచి వస్తుందో.. తెలియని పరిస్థితిలో ఒక మనిషి జీవితం నడుస్తుంది.
Viral video of crash site, not sure about its authenticity. pic.twitter.com/5ZhnyZ9Rik
— 🇮🇳Amit🇮🇱 (@amit_sainik) June 12, 2025