మిసైల్​ సైంటిస్ట్​ రామ్​నారాయణ్​కు ఘన నివాళి

మిసైల్​ సైంటిస్ట్​ రామ్​నారాయణ్​కు ఘన నివాళి
  • రాయదుర్గంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

గచ్చిబౌలి, వెలుగు : ప్రముఖ మిసైల్​ శాస్ర్తవేత్త, పద్మభూషణ్​ అవార్డు గ్రహీత డాక్టర్  రామ్​నారాయణ్​  అగర్వాల్​(84)  అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం రాయదుర్గంలోని మహాప్రస్థానంలో జరిగాయి. ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమం నిర్వహించారు. కంచన్​బాగ్ ​ రక్షాపురంలోని ఆయన ఇంటి నుంచి రాయదుర్గంలోని మహాప్రస్థానం వరకు కొనసాగిన అంతిమ యాత్రలో కుటుంబసభ్యులు, డీఆర్డీఓ శాస్ర్తవేత్తలు పాల్గొన్నారు.

మధ్యాహ్నం 2 గంటల సమయంలో రామ్​ నారాయణ్​ పార్థివదేహానికి ఆయన కుమారుడు అక్షయ్​ అగర్వాల్​ శాస్ర్తోత్తకంగా తలకొరివి పెట్టారు.  పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి నివాళి అర్పించారు. కాగా.. డీఆర్డీఓ చేపట్టిన అనేక క్షిపణి ప్రాజెక్టుల్లో రామ్ నారాయణ్​ కీలక పాత్ర పోషించారు. క్షిపణి పితామహుడిగా, అగ్నిమ్యాన్​గా గుర్తింపు పొందారు.