మొదలైన "డబల్ ఇస్మార్ట్".. ఈసారి పూరి మార్క్ గ్యారంటీ

మొదలైన "డబల్ ఇస్మార్ట్".. ఈసారి పూరి మార్క్ గ్యారంటీ

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram pothineni) హీరోగా, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్(Puri jagannadh) కాంబోలో వచ్చిన మాస్ మసాలా మూవీ ఇష్మార్ట్ శంకర్(Ismart shankar). 2019లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గరా భారీ విజయాన్ని అందుకుంది. రామ్ అండ్ పూరి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాను సీక్వెల్ గా "డబల్ ఇస్మార్ట్(Double ismart)" సీన్ సినిమాను అనౌన్స్ చేశారు మేకర్స్. తాజాగా జులై 10న "డబల్ ఇస్మార్ట్" సినిమా పూజ కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ఈ కార్యక్రమంలో పూరి జగన్నాధ్,రామ్,ఛార్మి(Charmi) పాల్గొన్నారు. దీనికి సంబందించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమా.. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే  మొదలు కానుంది.

ప్రస్తుతం బోయపాటి శ్రీను(Boyapati srinu)తో స్కంద(Skanda) సినిమా చేస్తున్న రామ్.. ఈ సినిమా కంప్లీట్ అవగానే "డబల్ ఇస్మార్ట్" షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఇక ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. మరి బ్లాక్ బస్టర్ సినిమాను సీక్వెల్ గా వస్తున్న "డబల్ ఇస్మార్ట్" పూరి అండ్ రామ్ కు ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుంది అనేది తెలియాలంటే 2024 మార్చ్ 8వరకు ఆగాల్సిందే.