ముస్లిం సమాధులపై రామాలయం నిర్మిస్తారా

ముస్లిం సమాధులపై రామాలయం నిర్మిస్తారా

సుప్రీం కోర్టు తీర్పుతో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ట్రస్టును ఏర్పాటు చేసింది. దీనిపై లేటెస్ట్ గా ఆ నగర ముస్లిం ప్రజలు ట్రస్టు అధిపతి లాయర్‌ కె.పరశరన్‌కు ఓ  లేఖ రాశారు. రామాలయ నిర్మాణం సనాతన ధర్మానికి విరుద్ధంగా ఉందని ఆ లేఖలో ముస్లింలు ఆరోపించారు. ధ్వంసమైన బాబ్రీ మసీదు ప్రాంతంలో ముస్లింల సమాధులు ఉన్నాయని, ఆ సమాధులపై రామాలయాన్ని నిర్మించడం సనాతన ధర్మానికి విరుద్ధమని ముస్లిం తరపున లాయర్ ట్రస్టుకు లేఖ రాశారు. అడ్వకేటు ఎంఆర్‌ శంషాద్‌ ఆ లెటర్ ను ఈనెల 15 వ తేదీన ట్రస్టుకు పంపారు.

1885 లో జరిగిన అల్లర్లలో సుమారు 75 మంది ముస్లింలు చనిపోయారని, వారి సమాధులు అక్కడే ఉన్నాయన్నారు. బాబ్రీ మసీదు ప్రాంతాన్ని స్మశానవాటికగా వాడారని, అలాంటి ప్రాంతంలో రామాలయాన్ని ఎలా నిర్మిస్తారని ఆ లేఖ ద్వారా ప్రశ్నించారు. ముస్లింల సమాధులపై రాముడి ఆలయాన్ని నిర్మిస్తారా.. ఇది హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తుందా…ట్రస్టు దీనిపై నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరారు.

67 ఎకరాల భూమిలో సుమారు 5 ఎకరాల స్థలంలో ముస్లింల స్మశానవాటిక ఉందని శంషాద్‌ తెలిపారు. మొత్తం 67 ఎకరాల భూమిని ఆలయ నిర్మాణం కోసం వాడుకోవడాన్ని ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు